ఏలూరు జిల్లా టీడీపీ కీలక నేత మాజీ ఎంపీ మాగంటి బాబు గత రెండు సంవత్సరాల నుండి రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.2019వ ఎన్నికలలో ఓటమి తరువాత ఇద్దరు కుమారులు మరణించటంతో… మాగంటి బాబు చాలా వరకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.అయితే తాజాగా ఇటీవల మళ్లీ బయట ప్రపంచం లోకి రావటం జరిగింది.ఈ సందర్భంగా మాగంటి బాబు మాట్లాడుతూ తాను వైసీపీలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు.
అంతమాత్రమే కాదు వైసీపీలోకి వెళ్లిన వాళ్లు త్వరలో తెలుగుదేశం పార్టీలోకి వస్తారని జోస్యం చెప్పారు.ఇదే సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చారని ఆరోపించారు.వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని… ఏ ఒక్కరికీ మేలు జరగలేదని అక్రమ అరెస్టులు.
పోలీసుల దౌర్జన్యాలను మరియు మంత్రుల దుర్భాషలు అంతా రౌడీయిజం అని అన్నారు.త్వరలో ప్రారంభం కాబోయే టీడీపీ మహానాడు రాష్ట్ర ప్రజలకు శుభ సమయం ప్రారంభం అవుతుందని.
ఏలూరు పార్లమెంటు రాజకీయాల్లో తానే ఉంటానని టిడిపి నేత మాగంటి బాబు స్పష్టం చేశారు.