సాయి దర్శనం కోసం షిరిడి వెళ్లాల్సిన పనిలేదు.. మోహన్ బాబు కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వివాదాల్లో చిక్కుకునే ఈయన తాజాగా షిరిడీ సాయిబాబా గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ మరో వివాదంలో చిక్కుకున్నారు.

 There Is No Need To Go Shirdi To Darshan Saibaba Mohan Babu Comments Viral Detai-TeluguStop.com

మోహన్ బాబు చంద్రగిరి మండలం రంగంపేటలో దక్షిణాదిలోనే అతి పెద్దదైన సాయి బాబా మందిరాన్ని నిర్మించారు.ఈ క్రమంలోనే గుడిలో సాయిబాబా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మోహన్ బాబు పాల్గొన్నారు.

ఈ విగ్రహావిష్కరణలో పాల్గొన్న మోహన్ బాబు ఈ ఆలయం గురించి షిరిడీ సాయినాధుని గురించి మాట్లాడుతూ పెద్ద ఎత్తున నేటిజన్ ల ఆగ్రహానికి గురయ్యారు.ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ దక్షిణాది భారత దేశంలోనే ఈ ఆలయం అతిపెద్ద ఆలయం అని ఈయన పేర్కొన్నారు.

ఈ ఆలయం నిర్మించిన తర్వాత నా దృష్టిలో భక్తులెవరు ఇకపై షిరిడి వెళ్లాల్సిన అవసరం లేదని ఈయన వెల్లడించారు.

ఇక ఈ గుడి నిర్మాణం చేపట్టే సమయంలో విష్ణు బాబు ఒక మాట అన్నారు.

Telugu Chandragiri, Manchu Vishnu, Mohan Babu, Rangampet, Sai Baba, Sai Baba Tem

వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు కూడా సాయిబాబా ఆలయానికి వచ్చేలా గుడి కడితే కట్టండి లేకపోతే లేదు అన్నారు.అలా విష్ణు బాబు చెప్పిన విధంగానే ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించామని మోహన్ బాబు వెల్లడించారు.ఇలా ఈ ఆలయం గురించి మాట్లాడుతూ ఇకపై సాయిబాబాను దర్శనం చేసుకోవాలంటే భక్తులు ఎవరు షిరిడి వెళ్లాల్సిన పనిలేదని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇలా మోహన్ బాబు షిరిడి సాయిబాబా గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఎంతోమంది సాయిబాబా భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube