డాలర్ మారకంలో భారత రూపాయి విలువ భారీగా పతనమైందని ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు.
భారత్ రూపాయి విలువ కుప్పకూలలేదని ఆమె స్పష్టం చేశారు.రూపాయి మారకపు విలువను మార్కెట్ శక్తులు, డిమాండ్–సరఫరాల పరిస్థితులు నిర్దేశిస్తాయని తెలిపారు.
రాజ్యసభలో ప్రకటన చేసిన నిర్మలా సీతారామన్.ఆర్బీఐ భారత్ కరెన్సీ విలువను నిరంతరం పర్యవేక్షిస్తుందని వెల్లడించారు.
అదేవిధంగా రూపాయి విలువను నిర్ణయించడానికి ఆర్బీఐ జోక్యం అంతగా లేదని, దాని వాస్తవిక స్థాయిని గుర్తించడం సముచితం అని స్పష్టం చేశారు.