సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో కమెడియన్లకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది డైలాగులు లేకపోయినా కేవలం వారి హావభావాలతో ప్రేక్షకులను నవ్వించే ఘనత కమెడియన్లకు మాత్రమే ఉంటుందని చెప్పాలి.ఇకపోతే కొన్ని సినిమాలు కమెడియన్ ల నటన ద్వారా కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి అంటే ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన పనిలేదు.
ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా సుమారు 1200 కు పైగా సినిమాలలో నటించినటువంటి హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ( Brahmanandam )గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోలతో కలిసి పని చేసిన బ్రహ్మానందం తాజాగా రంగమార్తాండ( Rangamarthanda ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమాలో బ్రహ్మానందం నటన అద్భుతమని చెప్పాలి.ఇక ఈయన నటనను చూసి ఎంతోమంది సినీ ప్రముఖులు ఈయన నటనపై ప్రశంసలు కురిపించారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బ్రహ్మానందం తన సినీ కెరియర్ గురించి పలు విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని తాను ఎప్పుడూ ముందుగా ఊహించుకోలేదని తెలిపారు.
కనీసం రెండు పూటలా తినడానికి తిండి లేని సమయంలో ఎంతో కష్టపడుతూ ఎమ్ ఏ పూర్తి చేశానని తెలిపారు.
ఇలా చదువు పూర్తి అయిన తర్వాత సినిమాలలోకి వస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదని బ్రహ్మానందం తెలిపారు.ఇండస్ట్రీలోకి రాకముందు డబ్బు కోసం ఎంతో ఇబ్బంది పడ్డానని ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పేరు కాపాడుకోవడం కోసం కష్టపడుతున్నానని బ్రహ్మానందం వెల్లడించారు.తాను ఇండస్ట్రీలోకి వచ్చి మంచి సక్సెస్ సాధించిన తర్వాత తన ఎదుగుదలని చూసి ఓర్చుకోలేనటువంటి వారు చాలామంది ఉన్నారని ఈయన షాకింగ్ కామెంట్ చేశారు.
సుధాకర్ ( Sudhakar )వచ్చిన తర్వాత బ్రహ్మానందం పని అయిపోయింది అన్నారు అలాగే ఎల్బీ శ్రీరామ్, బాబు మోహన్,పృద్వి వంటి కమెడియన్లు వచ్చిన తర్వాత బ్రహ్మానందం పని అయిపోయింది అవకాశాలు తగ్గిపోతాయి అన్నారు.అయితే వీటన్నింటిని దాటుకొని తాను ఇక్కడి వరుకు వచ్చానని ఈ సందర్భంగా తన జీవితం గురించి బ్రహ్మానందం చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.