హైదరాబాదులో మరో బ్యాంకుకు దొంగలు కన్నమేశారు.బ్యాంకు గోడకు కన్నమేసిన దొంగలు చేతికందిన మొత్తాన్ని ఎత్తుకెళ్లారు.
గోడకు కన్నంతో దొంగతనం జరిగిందని నిర్ధారించుకున్న బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.గోడకు కన్నమేసి బ్యాంకులోకి చొరబడ్డ దొంగలు పట్టుకెళ్లిన మొత్తమెంత అన్న విషయంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.వివరాల్లోకెళితే… చిక్కడపల్లి పరిధిలోని ఆంధ్రాబ్యాంకులో చోరీ జరిగింది.బ్యాంకు గోడకు దొంగులు వేసిన కన్నాన్ని చూసిన అధికారులు షాక్ తిన్నారు.
తలుపులు తీసుకుని బ్యాంకులోకి వెళ్లిన అధికారులు చోరీ జరిగిందని నిర్ధారించారు.వెనువెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు దొంగల కోసం వేట సాగిస్తున్నారు.