ప్రభుత్వానికి ఎదురు నిలబడితే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో తెలియాలంటే తీన్మార్ మల్లన్నను చూస్తే అర్థం అవుతుంది.తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ జనాలను జాగ్రుతం చేస్తున్నాడు.
అంతేకాదు.చెప్పే మాటలు, చేసే చేతలకు మధ్య ఉన్న తేడాను పూసగుచ్చినట్లు జనాలకు వివరిస్తున్నాడు.
కేసీఆర్ ఫ్యామిలీ ఈ రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేస్తుందో నిత్యం తన వెబ్ చానెల్ ద్వారా ప్రపంచానికి విడమర్చి చెప్తున్నాడు.తమ తప్పులను ఎత్తి చూపడంపై టీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉంది.
ఎక్కడ సందుదొరికితే అక్కడ మల్లన్నపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది.ఆయనపై గులాబీ పార్టీ నాయకులు ఎక్కవపడితే అక్కడ కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా లక్ష్మీకాంత్ శర్మ అనే జ్యోతిష్యుడు.తనను మల్లన్న, ఆయన క్యూ న్యూస్ టీం.డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ కేసు నమోదు చేశాడు.దీంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ చిలకలగూడ పోలీసులు తీన్మార్ మల్లన్నను అరెస్టు చేశారు.
కోర్టు మల్లన్నకు ఈనెల 9 వరకు రిమాడ్ విధించింది.ఆ తర్వాత మల్లన్న బెయిల్ కోసం ఆయన భార్య పిటిషన్ వేసింది.
అయితే కోర్టు దాన్ని తిరస్కరించింది.ప్రస్తుతం మల్లన్న జైల్లోనే ఉన్నాడు.
అటు మల్లన్న అరెస్టు అనంతరం ఆయన కూతురు తండ్రిపై బెంగ పెట్టుకుంది.తీవ్ర అనారోగ్యానికి గురైంది.దీంతో ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుంది.మల్లన్న కూతురు ఆరోగ్యం ముందు నుంచీ అంతగా బాగోదు.అయితే మల్లన్న అరెస్టు తర్వాత.ఆ చిన్నారి బాగా బెంగ పెట్టుకుంది.
తన తండ్రి లేకపోవడంతో అన్నం తినడం మానేసింది.దీంతో తను తీవ్ర అస్వస్థతకు గురైంది.
ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.కావాలనే మల్లన్నకు బెయిల్ రాకుండా తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆయన భార్య ఆరోపించింది.
రాజకీయాల విషయం అటుంచితే మల్లన్న కూతురు బాధను చూసి అందరూ అయ్యో అంటున్నారు.