కరోనా కారణంగా మార్చిలో మూతపడ్డ థియేటర్లు ఎట్టకేలకు మళ్లీ పునః ప్రారంభం అయ్యాయి.అయితే జనాలు థియేటర్లకు రావడం లేదని పెద్ద సినిమాలను విడుదల చేయడం లేదు.
పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు అంటూ జనాలు థియేటర్లకు రావడం లేదు.వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ వరకు థియేటర్లు పూర్తి స్థాయిలో నడవడం అనేది సాధ్యం అయ్యే పని కాదు.
కనుక పెద్ద సినిమాలు విడుదల కూడా అసాధ్యం అంటున్నారు.కరోనా భయం పూర్తిగా తగ్గి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది ఇక ఏం కాదులే అనుకున్నప్పుడు మాత్రమే జనాలు గతంలో మాదిరిగా థియేటర్లకు వస్తారు అంటున్నారు.
కనుక జనాలు థియేటర్లకు వచ్చే వరకు కూడా థియేటర్లు ఓపెన్ అవ్వవు.కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా ఉన్నారు.
కాని కొందరు నిర్మాతలు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు.
జనాలు వచ్చినా రాకున్నా కూడా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా విడుదల అవ్వాలి అనేది కొందరి డిమాండ్ కాని కొందరు నిర్మాతలు మాత్రం నష్టాలు కావాలని ఎవరు కొని తెచ్చుకుంటారు అంటున్నారు.
ఈ విషయంలో చాలా మంది చాలా క్లారిటీగా ఉన్నారు.తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల విషయంలో ఉన్న సస్పెన్స్ కు తెర దించి ఓపెన్ చేయగా పెద్ద సినిమాతలు మాత్రం మరి కొన్నాళ్ల పాటు మూత పడే ఉండాలని భావిస్తున్నారు.
కొందరు నిర్మాతలు మాత్రం థియేటర్లు ఇంకా ఎప్పుడు ఎప్పుడు అంటూ ఓపెన్ చేయించారు.మొత్తానికి రకరకాలుగా థియేటర్ల విషయమై చర్చ జరుగుతోంది.అనేక మంది ఈ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు.ముఖ్యంగా బడా నిర్మాతలు మాత్రం తమ సినిమాలు ఏమీ లేవని అంటున్నారు.
ఏ సినిమా కూడా విడుదలకు సిద్దంగా లేవు అంటున్నారు.కొన్ని సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు.
ఇలా నిర్మాతలు రెండు వర్గాలుగా చీలిపోయి సినిమా ప్రేక్షకులకు చిరాకు కలిగిస్తున్నారు.ఈ వివాదం ఎంత దూరం వెళ్లేనో చూడాలి.