ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు చేసుకోవడం, లేదంటే చస్తానని బెదిరించడం యువతకు ఫ్యాషన్ గా మారింది.ఇలాంటి ఆలోచనలు చేసే బదులు బ్రతుకుతో పోరాడితే ఓటమి అయినా తల వంచుతుంది.
కనీసం నలుగురిలో గుర్తింపు వస్తుంది.కానీ బ్రతికి సాధించలేనిది చచ్చాక సాధిద్దామనే ఆలోచనలతో యువత మనసులు బలహీనంగా మారడం విషాదకరం.
ఇకపోతే కర్ణాటకలోని హొసపేట తాలూకాలోని మరియమ్మనహళ్లిలో ఓ యువకుడు తాను ప్రేమించిన యువతితో పెళ్లికి సిద్దం అయ్యాడు.ఇరువురి పెద్దలు ఒప్పుకోవడంతో.కానీ కరోనా మహమ్మారి వల్ల వీరి పెళ్లి వాయిదా పడటంతో అలా రోజులు గడిచినా కానీ పెళ్లి ఊసు ఎత్తడం లేదట పెద్దలు.దీంతో విసుగుపుట్టిన ఆ యువకుడు ప్రాణాలతో చెలగాటమాడటానికి సిద్దం అయ్యాడు.
స్దానికంగా ఉన్న సెల్ టవర్ ఎక్కి తనకు త్వరగా పెళ్లి చేయకపోతే కిందకు దూకుతానని, ఆ టవర్కు అమర్చబడి ఉండే ఓ పరికరం పైన కూర్చుని అందరినీ హడలెత్తించాడు.దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఈ సాహస గాధలోని ప్రేమ కధకు శుభం కార్డు వేస్తారని నచ్చ చెప్పి అతన్ని కిందకు దిగేలా చేశారు.
అయినా పెళ్లి ఇవాళ్ల కాకపోతే రేపైనా, లేదా సంవత్సరానికైనా చేసుకోవచ్చు కానీ చస్తే ఎలా అనే ఆలోచనే రాకుండా ఇలా ప్రవర్తించడం విషాదం.