బిహార్లోని నలంద జిల్లా మన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరోహా గ్రామ సమీపంలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది.పరోహా గ్రామస్తులు పొరుగూరు అయిన ధనుకిలో నివసించే ఓ వ్యక్తిని పట్టుకుని బలవంతంగా పెళ్లి చేశారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్గా మారింది.
అసలేం జరిగిందంటే.
నవంబరు 11న నితీష్ కుమార్ అనే యువకుడు తన వదిన యొక్క తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు.ఛత్ పూజ నైవేద్యాలు తన అత్తమామలకు ఇచ్చి తిరిగి వస్తుండగా.
కొందరు వ్యక్తులు అతన్ని పట్టుకున్నారు.బందీగా చేసి తమతో పాటే బలవంతంగా పెళ్లి మండపానికి తీసుకెళ్లారు.
తాను పెళ్లి చేసుకోనని నితీష్ ఎంత చెప్పినా వారు మాత్రం వినకుండా బలవంతం చేశారు.ఈ క్రమంలో నితీష్ పారిపోవడానికి ప్రయత్నిస్తే అతనిపై విచక్షణారహితంగా దాడికి దిగారు.
దాంతో అతడు పెళ్లి పీటల పై అయిష్టంగానే కూర్చున్నాడు.కానీ యువతి మెడలో తాళికట్టునని మొండికేశాడు.
దాంతో ఆ దుండగులు అతడి తలకు గన్ ను గురిపెట్టి మరీ తాళి కట్టించారు.ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో ప్రత్యక్షమై అందర్నీ షాక్ కి గురి చేస్తున్నాయి.
అయితే పెళ్లి అయ్యాక వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న నితీష్ కుమార్ మన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.రాత్రంతా తనని బందీగా ఉంచారని, పెళ్లికి నిరాకరించడంతో తనపై దాడి కూడా చేశారని యువకుడు చెప్పాడు.తనకు న్యాయం చేయాలని నితీష్ విజ్ఞప్తి చేస్తున్నాడు.ఈ కేసు నమోదు చేశాక మన్పూర్ పోలీస్ స్టేషన్ చీఫ్ జితేంద్రకుమార్ మాట్లాడుతూ.అసలు విషయం ఏంటో విచారణ తర్వాతే తేలనుందని చెప్పారు.అయితే ఈ రకంగా పెళ్లి చేయడం తాము ఎన్నడూ చూడలేదు అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
ఆ ఊర్లో అతడే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనుకుంటా అని మరికొందరు సెటైర్లు పేల్చుతున్నారు.ఆ యువకుడికి ఇలా చేయడం చాలా అన్యాయం అని, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని మరికొందరు అభ్యర్థిస్తున్నారు.