ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందలకి దగ్గరగా ఉండే నల్లపురెడ్డి పల్లి గ్రామంలో ఉదయం తుపాకుల మోత మోగింది.రెండు కుటుంబాల మధ్య పాత కక్షలు ఉండటంతో.
ఉదయం ఒక్క సారిగా ఘర్షణ జరగటంతో ఒకరిపై ఒకరు గొడవకు దిగిన వ్యక్తులు కాల్పులు జరుపుకున్నారు.పార్థసారధి రెడ్డి (48), ప్రసాద్ రెడ్డి ( 62 ) ఇరువురు బంధువులు.
వీరి కుటుంబాల మధ్య ఎప్పటినుండో పాత కక్షలు ఉన్నాయి.
ఉదయం ఒక్కసారి గా వివాదం చెలరేగడంతో ప్రసాద్ రెడ్డి త్వరలో మండల అధ్యక్షుడు అయ్యే తరుణంలో పార్థసారథి రెడ్డి .కత్తితో ప్రసాద్ రెడ్డి పై దాడికి పాల్పడ్డటానికి రావటం జరిగింది.వెంటనే ప్రసాద్ రెడ్డి ఇంటిలో ఉన్న లైసెన్సు తుపాకి తీసుకుని పార్థసారధి రెడ్డి పై కాల్పులు జరిపారు.
పార్థసారధి రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.ఇదే టైం లో ప్రసాద్ రెడ్డి తనను తాను కాల్చుకుని మృతి చెందాడు.
ఈ పరిణామంతో రెండు కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి.వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గ్రామంలో .పరిస్థితి చేయి దాటి పోకుండా పర్యవేక్షిస్తున్నారు.
.