టీ, కాఫీ అంటే ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు.కానీ మహా అయితే రోజుకు ఒకసారో లేదంటే రెండు సార్లో తాగుతారు.
చాలా మంది ఉదయాన్నే వేడి వేడి కాఫీ కానీ టీ తాగి కానీ రోజు ప్రారంభించరు.అంతేకాదు రోజు పూర్తి అయ్యే సాయంత్రం సమయంలో కూడా కాఫీ, టీ పడంది బాడీ పని చేయదు.
అయితే మనం మిగతా ఆహారాలు ఏమీ తినకుండా అయితే అచ్చం కాఫీ, టీ లు తాగి బ్రతకం.
కానీ ఒక పెద్దావిడ మాత్రం గత 31 సంవత్సరాలుగా కేవలం టీ తాగి మాత్రమే జీవిస్తుందట.
అందుకు ఒక బాధాకరమైన సంఘటన ఉంది.అందుకే ఆమె టీ మాత్రమే త్రాగి జీవిస్తుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.బీహార్ కు చెందిన కిరణ్ దేవి అనే మహిళ 31 సంవత్సరాలుగా కేవలం టీ త్రాగి మాత్రమే జీవిస్తుంది.
ఆమె టీ మాత్రమే త్రాగి బ్రతుకుతుందని ఆమెను చాయ్ వాలీ అని పిలుస్తారట.
ఆమె ఆహారం తీసుకోకుండా కేవలం టీ త్రాగడానికి ఒక కారణం ఉందట.
ఏంటంటే.ఆమె భర్తకు టీ అంటే చాలా ఇష్టమట.
పెళ్లి అయినప్పటి నుండి ఇద్దరు కలిసి టీ త్రాగడం అలవాటుగా మారిందట.ఆమె భర్త ఆమె చేతి టీ త్రాగితేనే బయటకు వెళ్లే వాడట.
ఇలా వాళ్ళ లైఫ్ ఎంతో సాఫీగా, అన్యోన్యంగా సాగిపోతున్న సమయంలో ఆమె భర్త అకాల మరణం ఆమెను కృంగదీసిందట.
ఆమె తన భర్తను తలచుకుని రోజు బాధపడేదట.
ఆ షాక్ నుండి మెల్లగా కోలుకున్న తర్వాత నుండి ఆమె భర్తకు దూరమైన బాధలో టీ ఎక్కువుగా త్రాగడం మొదలు పెట్టిందట.ఆహారం తీసుకోకుండా కేవలం టీ త్రాగుతూ బ్రతుకుతుందట.
ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె కేవలం టీ త్రాగి బ్రతకాలని నిర్ణయించు కుందట.అందుకే ఉదయం, సాయంత్రం, రాత్రి ఇలా సమయంతో పని లేకుండా ఆమె టీ త్రాగి మాత్రమే బ్రతుకుతుంది.
ఎంతైనా 31 సంవత్సరాలుగా కేవలం టీ త్రాగి బ్రతకడం అంటే మాములు విషయం కాదు కదా.