దేశంలో ధరలు పెరిగితే విన్నూత రీతిలో నిరసన ప్రదర్శించడంలో మన వారు ముందుంటారు.ఈ క్రమంలో వరుసగా పెరుగుతున్న ఇందన ధరల విషయంలో కూడా ఇదే నియమాన్ని పాటిస్తున్నారు.
అందుకే ఒక వ్యక్తి పెళ్లిలో ఉల్లిగడ్దలు, పెట్రోల్ గిఫ్ట్గా ఇచ్చారు.ఇప్పుడు ఏకంగా 5 లీటర్ల పెట్రోల్ డబ్బాను ప్రైజ్గా అందజేశారు.
ఈ వింత ఎక్కడో తెలుసుకుంటే.
మధ్యప్రదేశ్లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
భోపాల్లో జరిగిన ఓ క్రికెట్ టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విజేతగా గెలిచిన అతనికి పెట్రోల్ క్యాన్ను ప్రైజ్గా ఇచ్చారు.కాగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో సలాహుద్దీన్ అబ్బాసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు.
కాగా టోర్నమెంట్ నిర్వాహకులు ఆ క్రికెటర్కు 5 లీటర్ల పెట్రోల్ డబ్బాను ప్రైజ్గా ఇచ్చి తమ నిరసను తెలిపారట.
ఇకపోతే దేశవ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే.
కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర లీటరకు వంద దాటింది.పెరిగిన ధరలను తగ్గించాలంటూ ప్రతిపక్ష పార్టీలు గగ్గోలుపెడుతున్న గానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు.
ఇకనైనా ప్రజల కష్టాలు అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ ఈ విధంగా పెట్రోల్ గిఫ్ట్ ఇచ్చారట.