దేవుడా... ఆవుపేడ దొంగతనం జరగడంతో ఊరంతా గొడవ గొడవ..!

ఇప్పటివరకు మనం డబ్బులు, బంగారం, ఏదైనా విలువ కలిగిన వస్తువులు పోయాయని వింటూ ఉండేవాళ్ళం.అయితే తాజాగా ఒకరి ఇంట్లో ఆవుపేడ మాయమైందని ఆ ఊర్లో తెగ గొడవ గొడవ జరిగింది.

 Cow, Dung, Theft, 100 Kg, Police-TeluguStop.com

ఇక అసలు విషయంలోకి వెళ్తే… ఈసంఘటన చత్తీస్ గడ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చోటు చేసుకుంది.జిల్లాలోని రోజీ గ్రామంలో ఓ రైతు కుటుంబంలో వంద కిలోల ఆవు పేడను ఎంతో కష్టపడి పోగు చేశారు.

అలా పోగుచేసిన ఆవుపేడను పశువుల దొడ్డిలో ఉంచారు.ఆ ఆవుపేడ 100 కిలోలు ఉందని రైతులు తెలిపారు.

అయితే గత రాత్రి 100 కిలోల ఆవుపేడను ఎవరో దొంగతనం చేశారని అల్లా రామ్, సేమ్ లాల్ అనే ఇద్దరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందించారు.అయితే ఈ సంఘటనతో ఆ గ్రామంలో మొత్తం పెద్ద దుమారమే రేగింది.

అయితే పోలీసుల సమక్షంలో కొందరు గ్రామ పెద్దలతో చర్చించిన తర్వాత ఆ విషయం కాస్త సద్దుమణిగింది.నిజానికి ఆ 100 కిలోల ఆవుపేడను ఆ ఇద్దరు రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించాలని అనుకున్నారు.

తీరా చూస్తే… ఆ ఆవు పేడ కనిపించకపోవడంతో ఈ గొడవలు జరిగాయి.

అసలు ఈ సంఘటన ఇంతలా జరగడానికి గల కారణం చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర సీఎం భూపేష్ ఈ మధ్యకాలంలో గొదన్ న్యాయ యోజన అని ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రం నేపథ్యంలో ప్రతి కిలో ఆవుపేడను 2 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు.దీంతో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఆవుపేడ కు ఊహించలేని డిమాండ్ పెరిగింది.

దీంతో ఇలాంటి సంఘటనలు గ్రామాలలో తరచూ జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube