దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.కేవలం 48 గంటల్లో దేశంలో ఏడు లక్షల నుండి 8 లక్షల వరకు కొత్త కేసులు నమోదు కావడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టెన్షన్ పెట్టిస్తుంది.
దీంతో ఇప్పటికే కరోనా నిబంధనలను అమలు చేసే విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు ఇదే తరహాలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం కూడా వేగవంతం చేస్తూ ఉంది.ఇదిలా ఉంటే దేశంలో ఈ రీతిగా వైరస్ విజృంభించడానికి గల కారణం గురించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలోకి బ్రిటన్ వేరియంట్లు ఎంట్రీ ఇవ్వడం జరిగింది అని, ఆ రకం వైరస్ వల్ల దేశంలో ఈ రీతిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి అని స్పష్టం చేశారు.పంజాబ్ రాష్ట్రంలో దాదాపు 80 శాతం కేసుల్లో బ్రిటన్ వేరియంట్లు ఉన్నట్టు పేర్కొన్నారు.
అంతేకాకుండా దేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరియు వివాహాలు అదేవిధంగా ఇతర వేడుకలు మరియు నిరసన కార్యక్రమాలు కారణంగా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్టు ఆరోగ్యశాఖామంత్రి పేర్కొన్నారు.
.