యుద్ధం అన్న తర్వాత మారణహోమం జరగడం సర్వసాధారణం.అయితే ఇటీవల కాలంలో మారణహోమం సృష్టించిన యుద్ధాలు జరిగిన దాఖలాలు లేవు.
అయితే రష్యా వల్ల ఇప్పుడు మనమందరం ఎన్నడూ చూడని దారుణాలను చూస్తున్నాం.రష్యన్ సైనికులు ఉక్రెయిన్ దేశాన్ని స్మశానవాటిక గా మారుస్తున్నారు.
ఈ క్రమంలో రష్యన్ సైనికులు కూడా మరణిస్తున్నారు.అద్భుతమైన అందాలతో ఎప్పుడూ పర్యాటకులను ఆకర్షిస్తూ ఎంతో సంతోషమైన ప్రదేశంగా ఉండే ఉక్రెయిన్ ఇప్పుడు శవాల దిబ్బలతో చాలా విషాదకరంగా మారింది.
తాజాగా యుద్ధం వల్ల అక్కడ పరిస్థితి ఎలా మారిందో చెప్పే ఒక ఘటన వెలుగులోకి వచ్చింది.మేరియుపొల్ సిటీ లోని శిథిలాలను తీస్తుండగా అధికారులకు దిగ్భ్రాంతికి గురి చేసే ఒక దృశ్యం కనిపించింది.
అది ఏంటంటే ఒకే అపార్ట్మెంట్ సెల్లార్లో 200 మృతదేహాలు కనిపించాయి.రష్యన్ సైనికులు ఉక్రెయిన్ ప్రజలను చంపేసి ఎలా దాచి పెడుతున్నారో ఈ ఘటనతో స్పష్టమయ్యింది.అయితే రష్యన్ సైనికులు ఉన్నత అధికారులు మాత్రం ఉక్రెయిన్ ప్రజలు సిటీ లను వదిలి వెళ్లేందుకు వీలుగా దాడుల తీవ్రతను తగ్గించాలని చెబుతున్నారు.
అయితే ఈ రెండు వందల మృతదేహాలు సామాన్య ప్రజలవా లేక సైనికులవా అనేది తెలియాల్సి ఉంది.ఈ మృతదేహాల వల్ల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దుర్వాసనతో నిండి పోయాయని స్థానిక అధికారులు తెలిపారు.అయితే ఈ ఒక్క నగరంలోనే 21 వేల మందికిపైగా పౌరులు చనిపోయారని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఏది ఏమైనా ఇలాంటి ఘోరాలను చూసేందుకే మనసు కలిచివేస్తోంది.అలాంటిది బంధువులను, స్నేహితులను కోల్పోయినవారు ఇంకా ఎంత బాధ పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.