ప్రభుత్వ ఆపీస్ లలో పనిచేసే ఉద్యోగులు బాధ్యతలను మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడం, కొట్టుకోవడం లాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే జరిగాయి.అధికారం చేతిలో ఉంది కదా అని తమ కింద పని చేసే ఉద్యోగులపై చేయి చేసుకుంటున్నారు.
ఈ మధ్య ఒక నర్సు ఆలస్యంగా వచ్చినందుకు ఒక ఆరోగ్యాధికారి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.మళ్ళీ ఇప్పుడు కూడా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరూ నర్సులు మరి ఘోరంగా అందరు చూస్తుండగానే జుట్లు పట్టుకుని మరి కొట్లాడుకున్నారు.
ఇంతకీ వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారో తెలిస్తే మీరే షాక్ అవుతారు.
డబ్బుల కోసం ఇలా చిల్లర మనుషుల్లాగా ప్రవర్తించారు.ఏ లక్షో లేక కోట్ల రూపాయిల కోసమో కాదులెండి… కేవలం రూ.500 కోసం ఇలా జుట్లు పట్లు పట్టుకుని మరి కొట్టుకున్నారు.వీరిని చూసి ఆపడానికి వెళ్లిన వ్యక్తిని సైతం లెక్కచేయలేదు ఆ మహిళలు.ఎవరికి వారు పుష్ప స్టైల్ లో తగ్గేదే లే అన్నట్టుగా పోటాపోటీగా కొట్టుకున్నారు.అసలు ఆ 500 రూపాయిల గొడవ ఏంటో చూద్దామా.
ఈ ఘటన బీహార్లో చోటుచేసుకుంది.బీహార్ లో జాముయ్ జిల్లాలోని లక్ష్మీపూర్ బ్లాక్లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ వింత ఘటన జరిగింది.అక్కడ గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్ రింటూ కుమారి అనే ఆవిడ బీసీజీ వ్యాక్సిన్ షాట్ కోసం అని ఆక్సిలరీ నర్సు మిడ్వైఫ్ అయిన రంజన కుమారి వద్దకు నవజాత శిశువును తీసుకెళ్లినది.
అయితే శిశువుకు వ్యాక్సిన్ వేసేందుకు ఆ ఆక్సిలరీ నర్సు 500 రూపాయిలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆశా వర్కర్ గొడవకు దిగింది.ఇలా మాట మాట పెరిగి ఆ ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు ఒకరినోకరు జుట్టుపట్టుకుని లాక్కుంటూ దారుణంగా కొట్టుకున్నారు.ఒక వ్యక్తి మధ్యలో కలగచేసుకుని వాళ్ళని విడదీసే ప్రయత్నం చేసినాగాని వాళ్ళు కొట్టుకోవడం ఆపలేదు.చివరికి చెప్పులతో కూడా ఘోరంగా కొట్టుకున్నారు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ ఘటనపై ఆస్పత్రి ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.
కానీ ఇప్పటిదాకా ఆ కార్యకర్తలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన అధికారులు తెలిపడం గమనార్హం.ఏది ఏమైనా ఒక బాధ్యత యుతమైన పదవిలో ఉన్నప్పుడు అందరూ చూస్తుండగా ఇలా కొట్టుకోవడం సరైన పద్దతి కాదు.