తెలంగాణ కాంగ్రెస్ నేతల ఈడీ విచారణ ముగిసింది.నేషనల్ హెరాల్డ్ కేసులో టీ.
కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, అనిల్ లు అధికారుల ఎదుట హాజరైయ్యారు.పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 50 ఏ ప్రకారం ఇరువురు నేతలను ఈడీ ప్రశ్నించింది.
ఈ విచారణలో భాగంగా గీతారెడ్డిని సుమారు 3 గంటల పాటు, గాలి అనిల్ ను రెండు గంటల పాటు విచారించారు.యంగ్ ఇండియా లిమిటెడ్ కు ఇచ్చిన విరాళాలపై స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు.
మరోవైపు ఇదే కేసులో పలువురు కర్ణాటక కాంగ్రెస్ నేతలను కూడా ఈడీ అధికారులు విచారించారు.