ఇటీవల అనంతపురం జిల్లాలో బోయ శ్రీకాంత్ అనే గ్రామ వాలంటీర్ ని అతి దారుణంగా పొలములో దుండగులు హత్య చేసి చంపేశారు.అనంతపురం జిల్లా కూడేరు మండలం శివరాంపేట గ్రామంలో పొలంలో నిద్రిస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తిని దుండగులు అతి కిరాతకంగా చంపడం జరిగింది.
ఇదిలా ఉంటే ఈ హత్యకు గల కారణం కుటుంబ కలహాలే అంటూ స్థానికులు చెబుతున్నారు.దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ స్టార్ట్ చేస్తూ ఉన్నారు.
ఉదయాన్నే పొలం పనులకు వెళ్తున్నా కూలీలు శ్రీకాంత్ మృతదేహాన్ని చూడటంతో సమాచారాన్ని పోలీసులకు అందించటంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అనంతపురం హాస్పిటల్ కి తరలించారు.తరచుగా శ్రీకాంత్ తండ్రి గ్రామాల్లో ఇతరులతో గొడవ పడటం వలన ఈ హత్య జరిగినట్లు పాత కక్షల కారణంగా శ్రీకాంత్ అనే గ్రామ వాలంటీర్ ని ప్రత్యర్ధులు చంపినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు.
ఇదే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో ముందుగా శ్రీకాంత్ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.