క్షణాల్లో దొంగతనం ఎలా చేయాలో పోలీసులకు దగ్గరుండి చూపించి ఓ దొంగ అవాక్ అయ్యేలా చూశాడు.తాను దొంగతనం ఎలా చూపించి పోలీసులను షాక్ గురి చేశాడు.
పోలీసులందరూ చూస్తుండగానే క్షణాల్లో దొంగతనం జరిగిపోయింది.దీనిని పోలీసులు వీడక్కడి దొంగరా బాటు అంటూ నోరేళ్లబెట్టారు.
అది కూడా కీస్ లేకుండా రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులు దొంగతనం చేసి ఔరా అనిపించాడు.దొంగలు చాక చక్యంగా రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులు దొంగలిస్తూ.
వాటిని అమ్ముకుంటూ జల్సాలు చేస్తుంటారు.అయితే వారు ఇటీవల పోలీసులకు దొరికిపోయారు.
పోలీసుల ధర్యాప్తులో దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి.
వివరాల్లోకి వెళితే.
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ డిడి నగర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు బుల్లెట్ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు.శ్యామ్ గుర్జార్, బజ్నా గుర్జార్ అనే ఇద్దరు దొంగలు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ లను చోరీ చేస్తూ వాటిని అమ్ముకునేవారు.
ఇప్పటికే దాదాపు పదుల సంఖ్యలో దొంగతనాలు చేశారు.పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి మూడు బుల్లెటు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ బైక్ లను ఎలా దొంగతనం చేశామో పోలీసుల ఎదుటే నిందితులు డెమో ఇచ్చారు.మొదటగా సీటు మీద కుర్చోని హ్యాండీల్ బలంగా ముందుకు నెట్టాడు.
దాంతో తాళం విరిగిపోయింది.ఇక వెంటనే వైర్లను కత్తిరించి సెల్ప్ బటన్ ప్రెస్ చేశాడు.
ఇక వెంటనే బండి స్టాట్ అయిపోయింది.ఈ పనులన్నీ చేయడానికి కేవలం నిందితులు 20 సెకన్లే తీసుకోవడం గమనార్హం.
యువత ఇలా తప్పుడు మార్గంలో వెళ్లకుండా సరైన రీతిలో సంపాదించి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పోలీసులు భావిస్తున్నారు.పోలీసుల ఎదురుగానే దొంగతనం జరగడంతో ఈ వీడియోలో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.