ఏమో అనుకుంటాం గానీ కొన్ని సార్లు దొంగల తెలివిని చూస్తే మతిపోవాల్సిందే అన్నట్టు ఉంటుంది.ఇప్పటికే చాలా ఘటనల్లో దొంగలు దోచుకున్న సొత్తును తరలించేందుకు ఎలాంటి ప్లాన్లు వేస్తున్నారో చూస్తే మన కండ్లను మనమే నమ్మలేకుండా పోతున్నాం.
మొన్నటికి మొన్న ఓ దొంగ తాను దోచుకున్న సొమ్మును చెప్పుల్లో పెట్టడం కూడా చూశాం.అంతకు ముందు పుచ్చకాయల్లో పెట్టి తరలించడం కూడా చాలా వైరల్ అయిపోయింది.
అయితే ఇప్పుడు కూడా ఓ దొంగ సొమ్మును ఎక్కడ పెట్టాడో తెలిస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి.
తమిళనాడులోని వెల్లూరులో రీసెంట్ గా జరిగిన ఘటన తెలిస్తే ఎవరూ నమ్మలేకుండా పోతున్నారు.
ఈ ప్రాంతానికి చెందిన ఓ ఆభరణాల షాపులో దొంగతనం చేసేందుకు అనైకట్ ఏరియాకు చెందిన ఓ దొంగ రెడీ అయిపోయాడు.అయితే ముసుగు వేసుకుని షాపులోకి ఎంట్రీ ఇచ్చిన ఆ దొంగ దాదాపు 15 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లాడు.
కాగా దీన్ని ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఏకంగా శ్మశానంలో దాచిపెట్టాడు.ఇక ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించి దొంగను పట్టుకున్నారు.
నాలుగు బృందాలుగా ఏర్పడి మరి ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు.
కాగా విచారణలో వారికి విస్తుపోయే నిజాలు చెప్పాడు ఆ దొంగ.వెల్లూరు సిటీకి దాదాపు 40 కి.మీ.లలో ఉన్నటువంటి ఒడుకత్తూరు శ్మశానవాటికలో దొంగిలించిన బంగారాన్ని మొత్తం ఎవరికీ అనుమానం రాకుండా పాతి పెట్టానని ఒప్పుకున్నాడు.దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇక ఈ వివరాలను స్థానిక పోలీసులు వెల్లడించారు.ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతోంది.
ఇదేం తెలివిరా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇంకొందరు అయితే అతని తెలివికి హ్యాట్సాఫ్ అంటున్నారు.