చికాగో ఉపాధ్యాయుల సమ్మెకు మద్ధతు తెలిపిన హైస్కూల్ రన్నర్లు శనివారం రాష్ట్ర-అర్హత మీట్లో పాల్గొనలేరని ఇల్లినాయిస్ న్యాయమూర్తి ఈవ్.ఎం.
రీల్లీ శుక్రవారం తీర్పు వెలువరించారు.జోన్స్ కాలేజ్ ప్రిపరేషన్ క్రాస్ కంట్రీ జట్టుకు చెందిన విద్యార్ధి- అథ్లెట్లు ఈ వారాంతంలో మీట్లో పాల్గొనడానికి అనుమతించాలని కోరుతూ వేసిన వ్యాజ్యంపై జడ్జి ఈ విధంగా తీర్పునిచ్చారు.
విద్యార్థుల తరపు అటార్నీ కెవిన్ స్టెర్లింగ్ మీడియాతో మాట్లాడుతూ.సదరు అథ్లెట్లు కీలకమైన కాలేజీ స్కాలర్షిప్లను పొంది వున్నారని తెలిపారు.ఒకవేళ వారు రీజనల్ మీట్లో పాల్గొనకపోతే.వారు ఇతర విభాగాలకు వెళ్లలేరని ఆయన వ్యాఖ్యానించారు.
పాఠశాలల మూసివేతలు ఉన్నప్పటికీ విద్యార్థులు మీట్ కోసం సన్నద్ధమవుతున్నారని స్టెర్లింగ్ తెలిపారు.సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి వారు ప్రతీరోజు ప్రాక్టీస్లో పాల్గొంటున్నారని వెల్లడించారు.
కాగా.చికాగో టీచర్స్ యూనియన్లోని 25 వేల మంది సభ్యులు తమ డిమాండ్ల సాధన కోసం వారం నుంచి సమ్మె చేస్తున్నారు.చిన్న తరగతుల పరిమాణం, మెరుగైన వేతనం, సహాయక సిబ్బంది, విద్యార్ధులు వారి తల్లిదండ్రులకు ఇళ్లను వారు కోరుకుంటున్నారు.అయితే ఈ సమ్మె చాలా కాలం సాగడంతో విద్యార్థి అథ్లెట్లను కాలేజీ కోచ్ల దృష్టిలో పడే అవకాశాన్ని కోల్పోతున్నారని స్టెర్లింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.