టోక్యో ఒలింపిక్స్.. తమిళనాడు సీఎం సూపర్ ఆఫర్..!

జూలై 23 నుండి ఆగష్టు 8 వరకు జరిగే టోక్యో ఒలింపిక్స్ కు క్రీడాకారులు సన్నద్ధం అవుతున్నారు.ఈ క్రీడలను ప్రేక్షకులు ఎవరు లేకుండానే నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది.

 Tamilnadu Cm Mk Stalin Announces Prize Money To Olympic Medalists, Announces, Cm-TeluguStop.com

ఈ క్రమంలో ఒలింపిక్స్ కు వెళ్తున్నభారత బృందానికి ప్రోత్సహించేలా తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ ప్రకటన చేశారు.

జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో పాల్గొనే భారత క్రీడాకారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం.ఈ క్రీడల్లో ఎవరైనా స్వర్ణ పతకం సాధిస్తే వారికి 3 కోట్లు నజరానా అందిస్తమని తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ వెల్లడించారు.ఇక రజత పతక విజేతలకు 2 కోట్లు, కాస్యం పతకానికి 1 కోటి అందిస్తామని ప్రకటించారు.

తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భారత ఒలింపిక్ బృందం తెగ సంబరపడుతుంది.సోషల్ మీడియా వేదికగా భారత అథ్లెట్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సీఎం అయిన దగ్గర నుండి తను తీసుకుంటున్న నిర్ణయాలతో స్టాలిన్ అందరిని సర్ ప్రైజ్ చేస్తున్నారు.ఓ విజన్ తో ఆయన తన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని తెలుస్తుంది.

సీఎం గా స్టాలిన్ సూపర్ అనిపించేలా ఇలాంటి ఎన్నో మంచి నిర్ణయాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube