దశాబ్దాల కాలంగా విచారణ జరుగుతున్న అయోద్య రామమందిరం విషయం అక్టోబర్ 18 లోగా పూర్తి అయ్యే అవకాశం ఉంది.సుప్రీం కోర్టు ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా విచారణ జరుపుతోంది.
నేడు 26వ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.ఈ సందర్బంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఒక వైపు విచారణ జరుగుతున్నా మరో వైపు మద్యవర్తిత్వం జరిపేందుకు కమిటీ చర్చలు జరపాలంటూ ఈ సందర్బంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
అక్టోబర్ 18 లోపు అయోద్య కేసు విచారణ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు.
నవంబర్ 17న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పదవి కాలం ముగియనుంది.అప్పటి వరకు ఈ కేసును పూర్తి చేయాలని ప్రధాన న్యాయమూర్తి పట్టుదలతో ఉన్నారు.
విచారణ పూర్తి అయిన తర్వాత తుది తీర్పు కూడా ఇచ్చే అవకాశం ఉంది.కేంద్ర ప్రభుత్వం మరియు హిందూ సంఘాలు తీవ్రంగా అయోద్యలో రామ మందిరం నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ముస్లీంలు మాత్రం అడ్డుకుంటున్నారు.