అమరావతి రాజధాని అంశంపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ గతంలో హైకోర్టు తీర్పును ఇచ్చింది.
ఈ క్రమంలో హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని సుప్రీం ధర్మాసనాన్ని ఏపీ ప్రభుత్వం ఆశ్రయించిన సంగతి తెలిసిందే.మరోవైపు హైకోర్టు తీర్పును యధాతథంగా అమలు చేయాలని రైతులు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో అమరావతి అంశంపై ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది.