వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసు విషయంలో సుప్రీంకోర్టు ( Supreme court ) సీరియస్ అయ్యింది.వివేక హత్య కేసు విచారణ ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.
దర్యాప్తు పూర్తిగా చేయకపోవడంతో పాటు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని సీబీఐని( CBI ) ప్రశ్నించింది.వివేక హత్య కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు అడిగింది.
ఇప్పటివరకు జరిగిన పూర్తి విచారణకీ సంబందించింది సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
దర్యాప్తు అధికారి ఎందుకు పూర్తి చేయటం లేదని… విచారణ త్వరగా ముగించకపోతే వేరే దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.ఈ అంశంపై సీబీఐ డైరెక్టర్ అభిప్రాయం తెలుసుకొని.న్యాయస్థానానికి తెలియజేస్తామని సీబీఐ తరపు లాయర్ సమాధానమిచ్చారు.
కేసు విచారణ ఆలస్యంపై… నిందితుడు శివ శంకర్ రెడ్డి భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.ఈ సందర్భంగా సుప్రీంకోర్టు… వివేక హత్య కేసులో విచారణ ఆలస్యంపై సీబీఐ పై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.