ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది.ఏపీ హైకోర్టు తరలింపు అనే అంశం న్యాయస్థానాల పరిధిలో ఉందని తెలిపింది.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం అమరావతిలో హైకోర్టు ఏర్పాటైందని కేంద్రం పేర్కొంది.
హైకోర్టును కర్నూలుకు తరలించాని సీఎం జగన్ ప్రతిపాదించారని కేంద్రం వెల్లడించింది.
ఈ క్రమంలో హైకోర్టు తరలింపునపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు కలిసే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు స్పష్టం చేశారు.కాగా టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.