తల్లి కంటి ముందే పుట్టిన బాబును పూడ్చిన ఆగంతకులు !

కొందరు ఆగంతకులు ఓ పసిబిడ్డను ఎత్తుకెళ్లి కన్నతల్లి చూస్తుండగానే పూడ్చి పెట్టారు.గంట కిందటే పుట్టిన బాబును మట్టిలో పూడ్చేసి పరారయ్యారు.

 Ap, East Godavari, Mother, Baby,-TeluguStop.com

అయితే పుట్టిన ఆ బాబు ఏడుపు వినిపించడంతో స్థానికులు అక్కడికి చేరుకుని పూడ్చిన ఆ బాబును బయటకు తీసి ఆస్పత్రిలో చికిత్స కోసం తీసుకెళ్లారు.ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం కిష్టవరంలోని ఆస్పత్రిలో ఓ మహిళ బాబుని జన్మనిచ్చింది.అయితే బాబు పుట్టిన గంటన్నర తర్వాత గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఆ పసిబిడ్డను ఎత్తుకెళ్లారు.

ఆస్పత్రి ఆవరణలో తల్లి చూస్తుండగానే పూడ్చి అక్కడి నుంచి పరారయ్యారు.కానీ, ఆ బాబు అదృష్టవంతుడనే చెప్పవచ్చు.పూడ్చినా స్థానికులకు బిడ్డ ఏడుపు వినిపించడంతో అక్కడికి స్థానికులు చేరుకుని బిడ్డను మట్టి నుంచి బయటకు తీసి డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లారు.ప్రాథమిక చికిత్స చేసి బిడ్డను బతికించగా.

మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.స్థానికులు పోలీసుకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ కొనసాగించారు.

అయితే పోలీసులు అనేక ప్రశ్నలు వెంటాడాయి.పుట్టిన పిల్లాడినే చంపేంత పాపం ఏం చేశాడని, బిడ్డను పూడ్చి వాళ్లేవరని, ఎక్కడి నుంచి వచ్చారనే దిశగా విచారణ ప్రారంభించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube