ప్రపంచాన్ని తలకిందులు చేసిన కరోనా వైరస్ నీ పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యా బోధనలో పాఠ్యాంశంగా చేర్చడం జరిగింది.ప్రస్తుతం 11 వ తరగతి విద్యార్థులకు సిలబస్ లో ఉన్న ఈ వైరస్ రానున్న రోజుల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఉండేది సబ్జెక్టులలో చేర్చాలని బెంగాల్ ప్రభుత్వం డిసైడ్ అయింది.
ఈ మహమ్మారిపై విద్యార్థులకు చిన్ననాటినుండే అవగాహన కలిగించే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది.
ఈ విధంగా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులకు ఈ మహమ్మారి తీవ్రత గురించి చిన్న నాటి నుండి తెలియజేస్తే అనేక లాభాలు ఉంటాయని విద్యావంతులు పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది అట.అంతేకాకుండా ముందస్తుగా కరోనా నిర్ధారించటం చాలా సులభతరంగా మారుతుందని అదేరీతిలో వ్యాక్సినేషన్ పై కూడా చైతన్యం కలుగుతుందని పేర్కొంటున్నారు.ఈ విధంగా పాఠ్యాంశాల పుస్తకం లో చేర్చడం వల్ల కరోనా పై అవగాహన ఉండి.
భయాందోళనలు తొలగిపోతాయని అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ యోగిరాజ రాయ్ స్పష్టం చేశారు.ప్రస్తుతానికి పాఠ్యాంశాలలో వైరస్ లక్షణాలు అదే రీతిలో ఏ విధంగా విస్తరిస్తుంది అనేదాని గురించి పుస్తకాలలో పొందుపరిచారు.