ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ చైనానీ అతలాకుతలం చేస్తోంది.మిగతా ప్రపంచ దేశాలలో కరోనా చాలావరకు కంట్రోల్ లో ఉంది.
కానీ కరోనా పుట్టినిల్లు చైనాలో మాత్రం కేసులు భారీ ఎత్తున వస్తున్నాయి.దీంతో చైనా ప్రభుత్వం ఎక్కడికక్కడ లాక్ డౌన్ లు ప్రకటిస్తూ సదరు ప్రాంతాలను పెద్ద భారికెడ్ లతో.అష్టదిగ్బంధనం చేస్తున్నారు.దీంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు.
సరిగ్గా ఇలాంటి పరిస్థితులలో చైనాలో జిన్జియాంగ్లో అతిపెద్ద నగరమైన ఉరుమ్కిలో ఓ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించి 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో ప్రజలు భారి ఎత్తున ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.
లాక్ డౌన్ లు వాళ్ళ సకాలంలో రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైందని, దీని కారణంగా అగ్నిప్రమాదంలో చిక్కుకున్న బాధితులు సకాలంలో తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయారని ప్రజలు ఆరోపిస్తు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు.వెంటనే దేశంలో లాక్ డౌన్ లు ఎత్తివేయాలని ప్రజలు పెద్దఎత్తున విధుల్లోకి వచ్చి నినాదాలు చేస్తున్నారు.
ప్రభుత్వంపై చైనా ప్రజలు చేస్తున్న నినాదాల వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్నయి.