ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తుంది.ఇటువంటి తరుణంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.దీంతో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలు కఠినంగా… రాష్ట్రంలో అమలు చేయడానికి రెడీ అయ్యింది.
దీనిలో భాగంగా రాష్ట్రంలో ఏ ఒక్కరూ మాస్కులు లేకుండా… బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే వంద రూపాయల ఫైన్ విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
అదే రీతిలో మాస్క్ లేకుండా.ఎవరినైనా దుకాణాలలోకి అనుమతిస్తే సదరు దుకాణదారుడుకి పరిస్థితి తీవ్రతను బట్టి వారికి రూ.10,000 నుండి రూ.25,000 వరకు జరిమానా విధించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.అదే రీతిలో మార్కెట్ లేదా ఏదైనా పెద్ద వాణిజ్య సంస్థలలో… కరోనా నిబంధనలు పాటించకపోతే… సదరు ప్రాంగణం మొత్తం రెండు రోజులు మూసేసేలా.
ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఇక ఇదే సమయంలో కరోనా నిబంధనలు ఎక్కడ ఎవరైతే పాటించకుండా ఉంటారో వాటికి సంబంధించిన ఫోటోలను వాట్సాప్ నంబర్ 8010968295లకి పంపిస్తే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది.