రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశ పంచాయతీ ఎన్నికలలో చాలా చోట్ల వైసీపీ పార్టీ హవా కొనసాగుతోంది.వచ్చిన ఫలితాల ప్రకారం వైసీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు.
ఇలాంటి తరుణంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక కామెంట్లు చేశారు.పంచాయతీ ఎన్నికలలో ఎక్కువ స్థానాలు వైసీపీ పార్టీ గెలవడం వెనకాల అసలు సీక్రెట్ పోలీసులే అని ఆరోపించారు.
ఇప్పటివరకు తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని భారీ డైలాగులు వేశారు.ముఖ్యంగా తన స్వగ్రామంలో ఎప్పుడు ఏకగ్రీవం అయ్యే చోట వైసీపీ పార్టీ గెలిచింది అంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు తెలిపారు.
పోలీసులు ఆడవాళ్ళని మరియు కుటుంబ సభ్యులను చూడకుండా కేసులు నమోదు చేస్తున్నారని అచ్చం నాయుడు ఆరోపించారు.ఎప్పుడూ తన గ్రామంలో 90 శాతం కంటే ఎక్కువ పోలింగ్ నమోదు అయ్యేదాన్ని కానీ ఈసారి పోలీసుల భయం చేత పోలింగ్ శాతం తగ్గిందని తెలిపారు.
మొత్తం మీద అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వైసీపీ పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
.