భారత దేశ ఐటీ రంగంలో సమూలమైన మార్పులు తీసుకువచ్చిన ఏకైక ఐటీ సంస్థ ఇన్ఫోసిస్.ఇన్ఫోసిస్ కేవలం భారత్ లో మాత్రమే కాకుండా దేశ విదేశాలలో తిరుగులేని సత్తా చాటుతోంది.
ఎంతో మంది భారతీయులకి ముఖ్యంగా తెలుగు వారికి అమెరికాలో ఉద్యోగకల్పన చేస్తూ వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టింది.అమెరికాలోని స్థానికులకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ భారత అత్యుత్తమ ఐటీ సంస్థగా అవతరించింది.అయితే
ఇప్పుడు ఈ అతిపెద్ద ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్ పై అమెరికాలో దావా వేశారు హక్కుల పరిరక్షణ సంస్థ.
అమెరికాలోని క్లాస్ యాక్షన్ లాసూట్ ఇన్ఫోసిస్ పై దాఖలు అయ్యింది.లాస్ ఏంజిల్స్ కి చెందిన వాటాదారుల హక్కుల పరిరక్షణ సంస్థ ది స్చాల్ లా ఫర్మ్ ఈ దావా వేసింది.
ఈ సంస్థ యొక్క ప్రధానమైన ఆరోపణ ఏమిటంటే.స్వల్పకాలానికి ఆదాయ లాభాలని పెంచి చూపించేందుకు కంపెనీ తన ఆర్ధిక నివేదికల్లో తప్పుడు లెక్కలు ప్రకటించిందని ఆరోపించింది.రెండు నెలల క్రితం ఇన్ఫోసిస్ పై ఓ సీక్రెట్ సంస్థ చేసిన ఆరోపణల ఆధారంగానే ఈ సంస్థ ఇన్ఫోసిస్ పై తాజాగా దావా వేసినట్లుగా తెలుస్తోంది.
అయితే సదరు కంపెనీ ఈ దావా వేయడం వలన ఇన్ఫోసిస్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అంటున్నారు నిపుణులు.
తాజా వార్తలు