ప్రకృతి అత్యంత చౌకగా ఇచ్చిన ఔషధం నిమ్మ.దీన్ని రసాన్ని తాగడం వలన శరీరంలోని మలినాల్ని, టాక్సిన్స్ ని దూరం చేసుకోవడంతో పాటు, ఒంటిని హైడ్రేటెడ్ గా ఉంచుకోవచ్చు.
అయితే దీన్నీ ఏ సమయంలో తాగితే బాగుంటుందో చాలమందికి తెలియదు.కేవలం ఈ టైమ్ లోనే తాగాలి అమ్మ రూల్ ఏమి లేదు కాని, కొన్ని సమయాల్లో నిమ్మరసం ఉపయోగపడే తీరే వేరు.
ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకోని తాగడం ఏంతో మంచిది.కొన్నిగంటల నీరు లేక నిద్రపోయిన శరీరాన్ని ఇది బాగా హైడ్రేట్ చేస్తుంది.
యాంటి ఆక్సిడెంట్ లా పనిచేస్తంది.శక్తిని అందింవడమే కాదు, యూరినరి ట్రాక్ట్, బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలను అడ్డుకుంటుంది.
క్యాన్సర్ అవకాశాలను తగ్గింస్తుంది.
అలాగే వ్యాయామం చేసేవారు నీటిని, సాల్ట్ ని కోల్పోతుంటారు.
అలాంటప్పుడు కూడా నిమ్మరసం బాగా పనికివస్తుంది.వ్యాయామం చేసేవారు కొంత విశ్రాంతిని ఇస్తూ, రోజుకి రెండు మూడుసార్లు నిమ్మరసం తాగితే మంచిది.
ఇక ఎండలు మండిపోతున్నప్పుడు శరీరం సులువుగా డీహైడ్రేట్ అవుతుంది.ఇలాంటి సమయంలో నిమ్మరసం సహాయపడుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.