సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ మృతితో ఒక్కసారిగా సినీ ప్రపంచం షాక్ కి గురయింది.2009లో మీనా విద్యాసాగర్ అనే సాప్ట్ వేర్ ఇంజనీరింగ్ ను పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు నైనిక అనే ఒక కుమార్తె ఉంది.ఇకపోతే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ జూన్ 29వ తేదీ కన్నుమూశారు.ఇకపోతే ఈయన మరణం గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు రావడంతో మీనా ఈ వార్తలపై స్పందించి ఎవరు కూడా ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టించకండి అంటూ వేడుకున్నారు.
తాజాగా సీనియర్ నటి కుష్బూ మీనా భర్త మరణ వార్తలపై స్పందించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
విద్యాసాగర్ గత కొంతకాలం నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు.ఆయనకు లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని భావించారు అయితే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి దొరకకపోవడంతో ఆయన ఆపరేషన్ అలాగే నిలిచిపోయింది.
అప్పటికి వైద్యులు మందులతో నయం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతోనే మృతి చెందారు.
ఈ విధంగా ఊపిరితిత్తుల సమస్యతో మృతి చెందిన విద్యాసాగర్ మృతి పట్ల ఎంతోమంది అనేక వార్తలను సృష్టిస్తున్నారు.పావురాల రెట్ట కారణంగా ఆయనకు ఇన్ఫెక్షన్ సోకి మరణించారని వార్తలు రావడంతో ఆ వార్తలను కుష్బూ ఖండించి అసలు విషయం వెల్లడించారు.విద్యాసాగర్ మృతి వెనుక ఉన్న కారణాలు తెలుసుకొని కథనాలు రాయండి అంటూ ఈమె మండిపడ్డారు.
ఇప్పటికే తన భర్త మృతి చెందడంతో ఆమె తీవ్రవిషాదంలో ఉంది మరి ఇలాంటి కథనాలతో మరింత బాధ పెట్టకండి అంటూ కుష్బూ మీనా భర్త విద్యాసాగర్ మృతి పై స్పందించారు.ప్రస్తుతం కుష్బూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.