టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న చైతన్య, సమంత వేర్వేరు కారణాల వల్ల విడిపోయిన సంగతి తెలిసిందే.గత రెండు నెలలుగా చైతన్య, సమంత విడిపోనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో చివరకు ఆ వార్తలే నిజం కావడం గమనార్హం.
చైసామ్ వైవాహిక బంధానికి స్వస్తి పలకడంతో వీళ్ల అభిమానులు సైతం బాధ పడుతున్నారు.మూడు సంవత్సరాలుగా అన్యోన్యంగా ఉన్న చైసామ్ దంపతులు విడిపోవడానికి గల కారణాలపై సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లలో బోల్డ్ గా కనిపించడం వల్లే నాగచైతన్య, సమంత మధ్య విభేదాలు వచ్చాయని చాలామంది భావిస్తున్నారు.
అక్కినేని ఫ్యామిలీ పద్ధతులను సమంత పాటించకపోవడం వల్లే వీళ్లిద్దరి మధ్య విభేదాలు వచ్చాయనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత గ్లామర్ ఫోటోలను షేర్ చేయడం కూడా చైతన్యకు నచ్చలేదని తెలుస్తోంది.
వేర్వేరు కారణాల వల్ల సమంత, చైతన్యల మధ్య దూరం పెరిగిందని సమాచారం.
సోషల్ మీడియాలో చైతన్య ఫుల్ యాక్టివ్ గా ఉంటే సమంత అస్సలు యాక్టివ్ గా ఉండరనే సంగతి తెలిసిందే.చైతన్య లాల్ సింగ్ ఛద్దా షూటింగ్ లో పాల్గొనే సమయంలోనే వీళ్లిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని సమాచారం.మరోవైపు చైతన్య, సమంత విడిపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఒకే తరహా పోస్ట్ చేశారు.
అక్టోబర్ నెల 6వ తేదీన నాలుగో వివాహ వార్షికోత్సవం జరగాల్సి ఉండగా చైతన్య, సమంత అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు.సమంత అక్కినేని అనే పదాన్ని తొలగించడంతోనే చైతన్యతో విడిపోతున్నట్టు హింట్స్ ఇచ్చిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.నాగార్జున, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ చైసామ్ మధ్య సమస్యలను తీర్చే ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదని సమాచారం.