పార్లమెంట్ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి.ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
ఇక రెండో రోజు కొనసాగుతున్న ఈ సమావేశంలో ఎయిర్క్రాఫ్ట్ బిల్లు సవరణకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.అంతేకాదు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు దేశీయ విమాన సర్వీసులకు తీర్చిదిద్దామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పురి తెలిపారు.
ఈ సందర్బంగా విమానయాన శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పురి మాట్లాడుతూ.విమానయాన రంగ రక్షణ విషయంలో ఎటువంటి లాలూచీ జరగలేదని ఆయన తెలిపారు.ఇక గడిచిన మూడేళ్ళలో వెయ్యి మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లను రిక్రూట్ చేసినట్లు వెల్లడించారు.అంతేకాకుండా ఇంకా 3500 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా భర్తీ మందగించిందని తెలిపారు.ముంబై, ఢిల్లీ విమానాశ్రయాలు 2006లో ప్రైవేట్ పరం చేసిన విషయం తెలిసిందే.
అయితే ప్రైవేటీకరణ వల్ల వచ్చిన 29వేల కోట్లను విమానాశ్రయాల అభివృద్ధికి వినియోగించినట్లు తెలిపారు.ఇక ఎయిర్పోర్ట్లు 33 శాతం ట్రాఫిక్ను ఆదాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా 2018లో ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేయడంతో కేవలం 9 శాతం ఆదాయం వస్తుందని తెలిపారు.ఇక వందేభారత్ మిషన్ ద్వారా విదేశాల నుండి 16 లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఇక విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని లేదంటే మూసివేయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.అంతేకాదు ఓటింగ్ తర్వాత ఎయిర్క్రాఫ్ట్ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదం తెలిపింది.