బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ రసవత్తరంగా సాగుతోంది.వారం వారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుండడంతో కంటెస్టెంట్ ల మధ్య పోటీ పెరుగుతోంది.
అంతేకాకుండా కొంత మంది కంటెస్టెంట్ ల మధ్య బంధాలు కూడా బలపడుతున్నాయి.కొందరు కప్పు ఎలా అయినా గెలవాలని చూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్పై గత సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సీజన్లో అందరూ ఎవరి సత్తా వారు చూపిస్తున్నారు అని రాహుల్ అన్నారు.
వారం వారం హౌస్లో మనుషులు తక్కువ అయ్యేకొద్ది ఎవరు బెస్ట్ అని చెప్పడం కష్టమని అన్నాడు.తను బిగ్ బాస్ షో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నానని, కానీ ఎవరికీ సపోర్ట్ చేయడం లేదని తెలిపాడు.
బిగ్బాస్ షో మంచిగున్నా, మంచిగ లేకపోయినా చూస్తానని చెప్పుకొచ్చాడు.పక్కింట్లో పంచాయితీ జరిగిందంటే అందరికీ ఆసక్తే కదా,ఆ ఆసక్తే షోను చూసేలా చేస్తుందని పేర్కొన్నాడు.
గతంలో తాను పాల్గొన్న మూడో సీజన్కు మంచి టీఆర్పీ వచ్చిందని, కానీ తర్వాత వచ్చిన సీజన్లు ఎప్పటికప్పుడు టీఆర్పీని పెంచుకుంటూ పోతున్నాయన్నాడు.కాగా ప్రస్తుతం బిగ్బాస్ షోలో తొమ్మిది మంది మిగిలారు.వీరిలో ఒకరు తాజాగా ఎలిమినేట్ అయ్యారు.అయితే వారం నుంచి అనుకుంటున్న విధంగానే ఈవారం బిగ్ బాస్ హౌస్ నుంచి అనీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యింది.అనీ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడంతో కాజల్ ఎమోషనల్ అయ్యింది.