పొద్దు పొద్దున్నే ఓ కప్పుడు వేడి వేడి టీ తాగందే చాలామందికి రోజు మొదలవ్వదు.నిత్యజీవితంలో భాగంగా మారిన టీలో ఎన్నో రకాలు ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా రేఖారాఖల టీలు ఉన్నాయి.కానీ ఎప్పటికప్పుడు సరి కొత్త రుచులతో కొత్త కొత్త టీ లు పుట్టుకొస్తున్నాయి.
తాజాగా మార్కెట్లోకి కొత్త తరహా టీ ఆకులు ప్రవేశించాయి.దీని ధర ఎంతో తెలిస్తే షాకవడం ఖాయం.ఈ టీ ఆకుల ధర కిలో రూ.24,501.ఈ టీ అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ జిల్లాలో ఈ టీఆకులు లభ్యమవుతాయి.ఈ టీ చూసేందుకు వంకాయి రంగులో కనిపిస్తుంది.చాయ్ మీద పరిశోధనలు చేసే ఒక సంస్థ ఈ తేనీరుకు గల చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేసింది.తొలుత ఈ చాయ్ని కీనియాలో వినియోగించారని తెలుస్తోంది.
ఈ అలవాటు అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్కు వచ్చినట్లు సమాచారం.
ఈ చాయ్ రిచ్ క్వాలిటీతో కూడి ఉంటుంది.కాగా ఈ చాయ్ క్యాన్సర్, హార్ట్ ఎటాక్ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి కాపాడుతుందని తెలుస్తోంది.కాగా ఈ తేయాకును అడవుల్లోనే పండించి తీసుకువస్తారని తెలుస్తోంది.గతంలో ఈ టీ రూ.15,000 ఉండగా, ఇప్పుడు మరింత ప్రియం అయ్యింది.