పట్టుదలతో ఆత్మగౌరవ బాహుటాను ఎగరేసేందుకు ఉన్న పదవికి కూడా రాజీనామా చేసి మరీ ఈటల రాజేందర్ ఉప ఎన్నికకు తెరలేపారు.ఇక ఆయన కావాలని చేసిన తర్వాత గెలిచేందుకు కూడా అదే స్థాయిలో కష్టపడుతున్నారు.
ఇందుకోసం ఏకంగా తన ఫ్యామిలీని కూడా రంగంలోకి దింపి పగలనక, రాత్రనక కష్టపడుతున్నారు.మళ్లీ గెలిస్తేనే తనకు రాజకీయ భవిష్యత్ ఉంటుంది లేదంటే ఆయనకు బీజేపీ కూడా ఎలాంటి గుర్తింపు ఉండదనేది కాదనలేని సత్యం.
కాబట్టే ఆయన ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గెలిచేందుకు సర్వశక్తులను ఖర్చుపెడుతున్నారు.
ఇక ఆయన సతీమణి జమున అయితే ఎండనక, వాననక కూడా ఎన్నికల నేపథ్యంలో ఈటలను గెలిపించేందుకు విపరీతంగా శ్రమిస్తూ ఊర్లల్లో తిరుగుతున్నారు.
నిత్యం తిరుగుతుఊ ఓటర్లను కలవటం తమకే ఓటు వేయాలని కోరడం ఇలా వారి ప్రచారం సాగుతోంది.ఎందుకంటే ఈ ఎన్నికల్లో గనక వారు ఓడితే ఈటల భవిష్యత్ కనుమరుగయిపోతుందని వారికి తెలుసు కాబట్టి చావో రేవో అన్నట్లుగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తన భర్త ఈటల రాజేందర్ ను గెలిపించుకునేందుకు శ్రమిస్తున్నారు.
కాకపోతే అప్పుడప్పుడు ఆమెకు కొన్ని షాక్లు కూడా తగులుతున్నాయి.
ఇక రీసెంట్గా ఈటల రాజేందర్ సతీమణి అయిన జమున ప్రచారంలో భాగంగా ప్రజలను ఆకట్టుకునేందుకు వారికి ఈటల రాజేందర్ ఫొటోలతో కూడిన గడయారాలను ఇస్తూ ప్రచారం చేస్తున్నారు.అయితే ఒక బాధితుడు జమున ముందే ఆమె ఇచ్చిన గడియారాన్ని నేలకేసి కొట్టి మరీ తమకు ఏం చేయట్లేదని, అందరూ ఇలాగే చెప్తున్నారు కానీ తమకు ఎలాంటి అభివృద్ధి చేయట్లేదనేది నిరసనను వ్యక్తం చేయటంతో జమున వెంటనే షాక్ కు గురయ్యారని తెలుస్తోంది.అయితే ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా ఉన్న ఈటలపై ఇలాంటి వ్యతిరేకత ఎందుకన్నదని ఆమె ఆలోచనలో పడ్డారు.