విమాన ప్రయాణం అంటే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయవలసి ఉంటుంది.ఏ చిన్న పొరపాటు జరిగినా విమానంలో ప్రయాణించే ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడటం ఖాయం.
ఇలా ఎన్నో సార్లు జరుగుతుంది.ఒక్కోసారి అదృష్టం బాగుంటే ప్రాణాలతో బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే ప్రస్తుతం విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఒక్క సారిగా టెన్షన్ పెట్టిన ఘటన ఆంధ్ర ప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయంలో చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.గన్నవరం విమానాశ్రయంలో ఫ్లైట్ ల్యాండింగ్ అవుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుందట.
ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పి పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది.
కాగా ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులందరు ఊపిరిపీల్చుకున్నారు.
ఇక ఈ ప్రమాద సమయంలో విమానంలో 63 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 19మంది గన్నవరంలో దిగినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.
కాగా ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానిక సిబ్బంది వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టినట్లుగా సమాచారం.