మదనపల్లె పట్టణంలో జరిగిన మర్డర్ నేరం మరోసారి జగన్ ముందే తాజాగా ఇద్దరు పిల్లలు వారి ప్రాణాలను కాపాడుకున్నారు.ఎనలేని అతీత శక్తులు వస్తాయన్న మూఢనమ్మకంతో ఓ మహిళ మరో మహిళను భర్త సహాయం పెళ్లి చేసుకోవడమే కాకుండా కన్న పిల్లలను చూడకుండా వారిని చిత్రహింసలు పెట్టసాగింది.
చివరికి నిజాన్ని గ్రహించిన పిల్లలు ఇంట్లో నుండి పారిపోయి నిజాన్ని బట్టబయలు చేసిన సంగతి తాజాగా బయటకు వచ్చింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా రంగం పాల్యం కు చెందిన రంజిత, రామలింగం అనే దంపతులకు దీపక్, కిషోర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.తండ్రి రామలింగం చీరల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తుండగా.
కొన్ని సంవత్సరాల తర్వాత అతను మరో మహిళతో రెండో వివాహం చేసుకున్నాడు.అయిన కానీ అతను ఇద్దరు భార్యలను ఒకే ప్రాంతంలో వేరువేరు ఇళ్లలో ఉంచి జీవనం కొనసాగిస్తున్నాడు.
అయితే రెండవ భార్య స్నేహితురాలు ధనలక్ష్మి అప్పుడప్పుడు మొదటి భార్య ఇంటికి వెళుతూ ఉండేది.వారిద్దరూ శివపార్వతుల ఉన్నారని రామలింగం అప్పుడప్పుడు అంటూ ఉండగా చివరికి రంజిత, ధనలక్ష్మిలు పెళ్లి చేసుకుంటానని తెలపక దానికి రామలింగం ఓకే చెప్పేసాడు.
దాంతో వారి ఇంట్లోనే పిల్లల ఎదుటనే ఆ మహిళలు ఇద్దరు వివాహం చేసుకున్నారు.అయితే ఇదే సందర్భంగా వారికి అతీత శక్తులు వస్తాయని మూఢనమ్మకంతో ధనలక్ష్మిని పిల్లలతో నాన్న అని పిలవమని, అలాగే కన్నతండ్రి రామలింగని మామ అని పిలవాలని బెదిరించడం మొదలు పెట్టారు.
ఇందులో భాగంగానే పిల్లలను పాఠశాలకు వెళ్లనివ్వకుండా ఇంట్లోనే ఉంచి వారితో పనులు చేయించడం అలాగే ఒంటికి కారం పుసి ఎండలో పడుకోబెట్టడం, శానిటైజర్ తాగించడం లాంటివి చేయించడంతో పిల్లలకు అనుమానం వచ్చింది.ఇదే నేపథ్యంలో వారు పిల్లలను నరబలి ఇచ్చేందుకు యత్నిస్తున్నారని తెలుసుకున్న పిల్లలు ప్రాణభయంతో చివరికి వారి తాత ఇంటికి ఇంట్లో నుంచి పారిపోయి చేరుకున్నారు.
అలా వెళ్లిన పిల్లలు పూర్తి విషయాన్ని వారి తాతకు తేలపగా వారంతా కలిసి ఈరోడ్ ఎస్పి కి ఫిర్యాదు చేశారు.దీంతో ధనలక్ష్మి, రంజిత, రామలింగం లను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
దీంతో పిల్లలు అప్రమత్తతతో ఉండడంతో పెను ప్రమాదం తప్పింది.