సీనియర్లను సాగనంపే ఆలోచన అన్ని పార్టీల్లో కనబడుతోంది.యువ రక్తంతో నింపాలని చూస్తున్నాయి.
యంగ్ లీడర్లకు అవకాశాలు ఇవ్వాలని.సీనియర్ల సేవలు పార్టీకి ఉపయోగించుకుని ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేయాలనే యోచనలో ఉన్నాయి.
ఇదే దారిలో వైసీపీలో ఇన్నేళ్లుగా సీనియర్లు చేసిన సేవలకు ముగింపు పలికి వాళ్ల వారసులకు.జూనియర్లకు అవకాశాలు పెంచాలని సీఎం జగన్ ప్లాన్ తో ఉన్నట్లు సమాచారం.
జాతీయ పార్టీ కాంగ్రెస్ లో సైతం యంగ్ స్టర్స్ ని తేవాలని రాహుల్ గాంధీ పట్టుబట్టిన విషయం తెలిసిందే.అలాగే టీడీపీలో కూడా యువ నాయకులకు అవకాశం ఇస్తామని మొన్నా మహానాడు సందర్భంగా లోకేష్ బాబు మాట్లాడిన విషయం విధితమే.
ఇక ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కూడా అదే కావాలని కోరుకుంటున్నారు.సీనియర్లతో కలివిడిగా ఉండలేకపోతున్నారని టాక్.
వయసు, అనుభవం రిత్యా వ్యక్తిగతంగానూ.పార్టీ పరంగానూ గౌరవించుకోవాలి.
అది తప్పదు.జగన్ కూడా యంగ్ స్టర్ కాబట్టి సీనియర్ల సలహాలూ సూచనలూ అవసరమే.
అయితే ఈ మూడేళ్ల పరిపాలన తర్వాత అన్ని ఆలోచించుకుని మలి విడత మంత్రివర్గ విస్తరణలో సీనియర్ల ప్రాధాన్యత తగ్గించాలని చూసినప్పటికీ అది వీలు పడలేదు.మళ్లీ సీనియర్లకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది.
అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం సీనియర్లను సైడ్ చేసి వారి వారసులైనా.ఇతరులైనా యంగ్ స్టర్స్ తో నింపేయాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
అయితే సీనియర్లుకు పార్టీ పరంగా తగన పదవులు కట్టబెట్టి గౌరవించుకుంటారనే చర్చ కూడా నడుస్తోంది.ఇక పెద్దలకు ఎమ్మెల్సీలు, రాజ్య సభ మెంబర్స్, పార్టీ ఇన్ చార్జీ వంటి పదవులు కట్టబెట్టాలని చూస్తున్నారు.
అయితే ఇప్పటికే ఈ విషయంలో జగన్ ఓ నిర్ణయానికి వచ్చి లిస్ట్ అవుట్ చేసినట్లు చర్చ నడుస్తోంది.భారీ ఎత్తున తలపెట్టనున్న పార్టీ ప్లీనరీ సమావేశాల్లో సీనియర్లకు నచ్చజెప్పి తమ వారసులను సిద్దం చేయాలని చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
సీనియర్లు పోటీ చేయకపోతే తమ వారసులకు కచ్చితంగా టికెట్ ఇస్తామని వారి వెనక మీరే ఉండి గెలిపించాలని కోరనున్నారట.అంతే తప్ప నేను సీనియర్ ని నాకు సీటు కావాలి.
మంత్రి పదవి కావాలి అంటే మాత్రం మరో మార్గం వెతుక్కోవాల్సిందే అనే సూచనలు ఇస్తున్నారట.
కాగా ఇప్పటికే ఓ సీనియర్ల జాబితా లిస్టు వైసీపీలో చక్కర్లు కొడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, బొత్స సత్యనారాయణధర్మాన ప్రసాదరావు, స్పీకర్ ధర్మాన సీతారామ్, ఎమ్మెల్యేలు ఆనం రామ్ నారాయణరెడ్డి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, రంగనాథరాజు, కరణం బలరాం, అనంత వెంకట్రామిరెడ్డి లాంటి వారిని ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ నేతలు కూడా తమ వారసులను సిద్దం చేసుకునే పనిలో ఉన్నారట.
అయితే సీనియర్లు రిటైర్మెంట్ కి ఒప్పుకుంటారో లేదో చూడాలి మరి.