పలు దేశాలలో నివసించే ప్రజలు తాము పెంచుకునే పెంపుడు జంతువులకు పుట్టినరోజు లు అంటూ కొన్ని వాటికి సంబంధించిన వేడుకలను ఘనంగా జరుపుతుంటారు.అంతేకాకుండా వాటిని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తారు.
ప్రస్తుతం అలా పెంపుడు జంతువులకు చాలామంది పుట్టినరోజు వేడుకలను జరపడం మామూలు అయిపోయింది.అయితే మనదేశంలో కూడా కొందరు ఇలా చేయడమే కాకుండా ఏకంగా పిల్లికి సీమంతం చేసిన ఘటన చోటు చేసుకుంది.
చెన్నైలో తిరువేర్కాడు స్వామి నటేశనార్ నగర్ కి చెందిన జ్యోతి కుమార్, శివగామి దంపతులు.వీళ్ళు ఓ పిల్లి ని పెంచుకుంటున్నారు.దానికి రియా అని పేరు కూడా పెట్టారు.కాగా ఇటీవలే రియా గర్భం దాల్చగా సీమంతం చేయాలని శివగామి తన భర్తతో కోరింది.
దీంతో దానికి కావలసిన పదార్థాలు చేసారు.అంతేకాకుండా రియా కు ఇష్టమైన చికెన్, రొయ్యలు, చేపల ను ఆహారంగా చేసి దానికి అందించింది.
అంతేకాకుండా శివగామి తన ఇంటి చుట్టూ ఉన్న వాళ్లని సీమంతానికి ఆహ్వానించగా.వాళ్లు రియా కు బొట్టు పెట్టి ఆశీర్వదించారు.
శివగామి ఒక తల్లిగా.తల్లి కాబోతున్నటు ఏ జీవికైనా ఆనందమే అంటూ.అందుకే తన పెంపుడు పిల్లి కి సీమంతం చేయాలని కోరిక పుట్టింది అని తెలిపారు.ఈ విధంగా ఈ విషయానికి సంబంధించి జ్యోతి కుమార్ మాట్లాడుతూ.
తమ ఇంట్లో రియా అనే పిల్లి తో పాటు మరో రెండు మగ పెంపుడు కుక్కలు ఉన్నాయని వాటికి కూడా తమ పుట్టినరోజు లు సందర్భంగా వేడుకలు జరుపుతుంటామని తెలిపాడు.ఈ విధంగా ఈ కుటుంబం మూగజీవుల మనసులను అర్థం చేసుకొని వాటికి కూడా తమకు సంబంధించిన సందర్భాలలో వేడుకలు జరపడంలో వాళ్లకే కాకుండా ఆ జంతువులకు కూడా ఆనందంగా ఉంటుందని అర్థమవుతుంది.