ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయింది.కొంత మంది ఇంటర్నెట్ సాయంతో వండర్స్ క్రియేట్ చేస్తుంటే మరికొంత మంది మాత్రం ఇతరులను వేధించేందుకు సాంకేతికతను వాడుతున్నారు.
తర్వాత దొరికి పోయి అడ్డంగా బుక్కవుతున్నారు.చివరికి కటకటాల పాలవుతున్నారు.
ఒకరికి ఇలా జరిగినా కానీ వేరే వ్యక్తులు మారడం లేదు.వారు కూడా అలాగే ప్రవర్తిస్తూ తమల్ని నమ్మిన వ్యక్తులను మోసం చేస్తున్నారు.
చివరికి వారితో సహా అందరితో ఛీ కొట్టంచుకుంటున్నారు.ఇటువంటి ఘటనే ప్రస్తుతం భాగ్యనరగంలో జరిగింది.
వివరాలు తెలుసుకున్న ఆ యువతి ఇదంతా చేసింది తన భావే అని తెలుసుకుని షాక్ అయింది.చివరకు ఆ వ్యక్తి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.
దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.
భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన సాయి క్రిష్ణ అనే వ్యక్తి తనకు వరుసకు మరదలు అయ్యే యువతిని చాలా రోజుల నుంచి వేధిస్తూ వస్తున్నాడు.సాయి క్రిష్ణ కొన్ని రోజుల క్రితం బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్లాడు.
అక్కడ వరుసకు మరదలు అయ్యే యువతితో పరిచయం ఏర్పడింది.యువతి మీద మోజు పెంచుకున్న సాయి క్రిష్ణ ఎలాగైనా సదరు యువతిని లోబర్చుకోవాలని పథకం పన్నాడు.
తను వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆ యువతి స్నానం చేస్తుండగా దొంగ చాటుగా వీడియో తీశాడు.
అలా చేసిన తర్వాత సాయిక్రిష్ణ నకిలీ సిమ్ కార్డు ఒకటి తీసుకుని అందులో వాట్సాప్ క్రియేట్ చేశాడు.ఈ వాట్సాప్ నుంచి సదరు యువతికి తాను స్నానం చేసే న్యూడ్ వీడియోను పంపించాడు.అది బయటపెట్టకుండా ఉండాలంటే న్యూడ్ వీడియో కాల్ చేయాలని కొన్ని రోజుల నుంచి వేధిస్తూ వస్తున్నాడు.
దీంతో విసుగు చెందిన ఆ యువతి ఇలా చేస్తుంది? ఎవరా? అని ఎంక్వైరీ చేసింది.ఆయువతి ఎంక్వైరీలో ఇలా చేస్తున్నది తనకు బావ వరుస అయ్యే సాయి క్రిష్ణే అని తెలుసుకుని షాక్ కు గురయింది.