తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి కిరీటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్( Rajendra Prasad ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన కామెడీ సినిమాలలో హీరోగా నటించిన రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం పలు సినిమాలలో హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలలోనూ నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇలా ఇప్పటికి పలు సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి రాజేంద్రప్రసాద్ తాజాగా తిరుమల శ్రీవారిని( Tirumala Srivaru ) దర్శించుకున్నారు.
శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో రాజేంద్రప్రసాద్ స్వామి వారిని దర్శించుకుని అనంతరం ఆలయం వెలుపల సందడి చేశారు.సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కడైనా కనబడితే పెద్ద ఎత్తున ఫోటోగ్రాఫర్లు అభిమానులు వారిని చుట్టుముట్టి ఫోటోల కోసం ఎగబడుతూ ఉంటారు.అయితే కొంతమంది సెలబ్రిటీలు చాలా ఓపికగా అభిమానులతో కలిసి ఫోటోలు దిగగా మరికొందరు చిరాకు పడుతూ ఉంటారు.
అయితే ఈ విషయంలో రాజేంద్రప్రసాద్ సైతం కాస్త అసహనం వ్యక్తం చేశారనే చెప్పాలి.
స్వామివారి దర్శనం అనంతరం రాజేంద్రప్రసాద్ ఆలయం వెలుపల సందడి చేయడంతో పెద్ద ఎత్తున ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టి ఫోటోలు తీశారు.అనంతరం అభిమానులు కూడా ఆయన వెంటపడుతూ సెల్ఫీల(Selfi) కోసం ఎగబడ్డారు.ఈ క్రమంలోనే రాజేంద్రప్రసాద్ సెల్ ఫోన్లలో కెమెరాలు కనిపెట్టిన వారు ఎవరో కనుక తెలిస్తే చంపేస్తాను అంటూ సరదాగా కామెంట్ చేశారు.
ఇలా రాజేంద్రప్రసాద్ ఇలాంటి కామెంట్స్ చేసినప్పటికీ అభిమానులు అందరూ ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఎగబడటంతో చేసేదేమీ లేక రాజేంద్రప్రసాద్ కూడా వారితో కలిసి ఫోటోలు దిగారు.