జాతీయస్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా కూటములు ఏర్పడటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో శరద్ పవర్, యశ్వంత్ సిన్హా వంటి నాయకులు ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం పంపడం జరిగింది.
దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అదే రీతిలో వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలు బిజెపికి వ్యతిరేకంగా పోరాడటానికి రెడీ అవుతూ ఉన్నాయి.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించడానికి ప్రతిపక్షాలు మొత్తం ఏకం కావాలని యశ్వంత్ సిన్హా రాష్ట్ర మంచ్ అనే కార్యక్రమం ద్వారా ఆహ్వానాలు పంపడం జరిగింది.
ఈ సమావేశానికి రాష్ట్రీయ జనతాదళ్ అధినేత ఆమ్ ఆద్మీ పార్టీ మరికొంతమంది ఇతర పార్టీలకు చెందిన నాయకులు.త్వరలో రానున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ముఖ్యంగా ఇటీవల జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికలలో బిజెపి అనుకున్న రీతిలో సాధించలేకపోవడంతో ఇదే సరైన టైం అని ప్రతిపక్షాలు భావిస్తూ.బిజెపి ని ఎలాగైనా 2024 ఎన్నికలలో గద్దె దించాలని వ్యూహాలు వేస్తున్నాయి.