తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికల తరువాత అత్యంత హాట్ హాట్ గా సాగిన ఎన్నికలు బల్దియా ఎన్నికలు.ఎన్నికలలో అన్ని పార్టీలు మాటల తూటాలు పేలుస్తూ ఎన్నికల రణరంగంలోకి దిగాయి.
ఓటర్లు ఏ పార్టీకి మొత్తంగా పట్టం కట్టకపోయినా అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది.రెండో స్థానంలో బీజేపీ ఉండగా, మూడో స్థానంలో ఎంఐఎం ఉండగా, కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో నాలుగో స్థానంలో ఉంది.
ఇక ఇప్పుడు బల్దియా పీఠాన్ని అధిరోహించేది ఎవరు అనే ఉత్కంఠ మొదలైంది.ఫిబ్రవరి 11 న నూతన మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారవడంతో ఇక నెల రోజులే ఉండడంతో మేయర్ ఎవరు, డిప్యూటీ మేయర్ ఎవరు, ఏ పార్టీ వారు మేయర్ పీఠాన్ని అధిరోహించనున్నారు అనే విషయంపై ఎవరికి వారు విశ్లేషిస్తున్నారు.
కాe ప్రస్తుతం టీఆర్ఎస్ ఎక్కువ మేయర్ స్థానాలు గెలిచిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకే మేయర్ పీఠం దక్కించుకునే అవకాశం ఉంది.ఒకవేళ ఎంఐఎం, టీఆర్ఎస్ కు మిత్రపక్షం కాబట్టి ఒక వేళ ఎంఐఎంతో కలిసి పొత్తు ఏర్పడితే వారిరువురి ఒప్పందాన్ని బట్టి పదవులు పంచుకోనున్నారు.
ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీకే మేయర్ పీఠం అధిరోహించే అవకాశాలు ఉన్నాయని చెపుకోవచ్చు.