టాలీవుడ్ హీరో మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు నిన్న రాత్రి యాక్సిడెంట్ అయినా విషయం తెలిసిందే.ఈయన స్పోర్ట్స్ బైక్ మీద వెళ్తుంటే ప్రమాదానికి గురి అయ్యాడు.
కేబుల్ బ్రిడ్జ్ దగ్గర సాయి ధరమ్ తేజ్ తన బైక్ మీద వెళ్తుండగా ప్రమాదం జరగడంతో స్థానికులు గుర్తించి దగ్గర ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.సమాచారం అందుకున్న వెంటనే చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ హాస్పిటల్ కు వెళ్లారు.
వెంటనే సాయి తేజ్ ఆరోగ్యంపై ఆరా తీసి మెరుగైన వైద్యం కోసం అపోలో హాస్పిటల్ కు తరలించారు.ఇప్పటికే మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారని మెగాస్టార్ సోషల్ మీడియాలో సాయి తేజ్ ఆరోగ్యంపై ట్వీట్ చేసారు.
సాయి తేజ్ స్పృహలో లేడని కానీ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన అభిమానులకు తెలిపారు.మెగాస్టార్ చిరంజీవి సాయి తేజ్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు.
ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
ఇక సాయి తేజ్ ఆరోగ్యంపై తాజాగా అపోలో హాస్పిటల్ వైద్యులు ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసారు.ఇందులో వైద్యులు తెలిపిన ప్రకారం.సాయి తేజ్ ఆరోగ్యం ప్రెసెంట్ నిలకడగానే కొనసాగుతూ ఉందట.
ఇక కీలక ప్రాంతాల్లో శరీరంపై తీవ్ర గాయాలు అవ్వక పోవడంతో శరీరంలోని ఏ అవయవాలు డామేజ్ అవ్వలేదని వైద్యులు తెలిపారు.అయితే ప్రస్తుతం సాయి తేజ్ కు ఐసీయూ లో చికిత్స చేస్తున్నట్టు తెలిపారు.ఇక రేపు మిగతా వివరాలు చెబుతామని వైద్యులు తెలిపారు.సాయి తేజ్ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని తెలియడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.