ప్రస్తుత రోజుల్లో మనుషులకు ఉన్న విశ్వాసం రోజు రోజుకి తగ్గుతూ ఉంటే.మూగజీవాలకు మనుషుల కంటే ఎక్కువ విశ్వాసం ఉంటుంది.
ప్రస్తుత సమాజంలో డబ్బు ఉంటే తప్ప పలకరించని బంధువులు ఎంతో మంది ఉన్నారు.సొంత వారే మృతి చెందితే పట్టించుకోని కుటుంబ సభ్యులు ఉండే సమాజంలో మనం జీవిస్తున్నాం.
అయితే తాజాగా ఒక ముగజీవి చనిపోయిందని ఓ అటవీ ఆఫీసర్ తీవ్ర మనస్తాపానికి గురై వెక్కివెక్కి ఏడ్చేశాడు.
ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.ఇందుకు సంబంధంచిన పూర్తి వివరాల్లోకి వెళితే.
తమిళనాడు రాష్ట్రంలోని ముదుమలై టైగర్ రిజర్వ్ లోని సాదివాయల్ ఎలిఫెంట్ క్యాంప్ లో ఉన్న ఓ ఏనుగు తీవ్రంగా గాయపడటంతో రేంజ్ ఆఫీసర్ గాయపడిన ఎలిఫెంట్ ను క్యాంపు లో ఉన్న వైద్యులతో చికిత్స అందజేశారు.ఆ ఏనుగు ప్రాణాలను నిలబెట్టేందుకు వైద్య సిబ్బంది ఎంతగానో శ్రమించిన కూడా చివరకు ఫలితం దక్కలేదు.
చికిత్స పొందుతూనే ఏనుగు మృతి చెందింది.దీనితో ఖననం చేసేందుకు అటవీశాఖ సిబ్బంది వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
ఖననం చేసేందుకు ఆ ఏనుగును లారీలో ఎక్కించారు.
ఆ ఏనుగుకి కడసారి వీడ్కోలు పలికేందుకు ఆ లారీ దగ్గరికి రేంజ్ ఆఫీసర్ అక్కడికి వెళ్లి దాని తొండాన్ని నిమురుతూ ఏడ్చేశాడు.ఈ సంఘటన మొత్తం ప్రముఖ అటవీశాఖ అధికారి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన కొంతమంది “unconditional love” అంటూ వారి కామెంట్స్ పెడుతున్నారు.” unconditional love ” అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది.ఏదేమైనా కానీ ప్రస్తుత సమాజంలో ఇలాంటి వారు ఉండడం కూడా చాలా సంతోషకరమైన విషయం.