ప్రస్తుతం అయితే దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న గానీ గత సంవత్సరం నెలకొన్నటువంటి క్లిష్ట పరిస్దితులైతే ఇంకా సంభవించలేదు.కానీ కోవిడ్ కేసుల్లో మాత్రం వేగం పెరిగింది.
ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే.ఇందుకు గాను కరోనా నిబంధలను మాత్రం ఖచ్చితంగా అమలుచేయాలని ఆదేశించింది.
ఇకపోతే కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ దేశంలోని కోవిడ్ కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
వీరి లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 45,674 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇదేసమయంలో కరోనా బారిన పడి 559 మంది మృతి చెందారని వెల్లడించింది.
ఇక ప్రస్తుతం దేశం లో కరోనా కేసుల సంఖ్య 85,07,754 కు చేరగా, మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,26,121 కు చేరింది.కాగా రికవరీ రేటు 92.49 శాతానికి పెరిగిందని, మరణాల రేటు 1.48 శాతానికి తగ్గిందని ఆరోగ్యశాఖ వెల్లడిస్తుంది.